క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసిన అనసూయ..!

  • January 10, 2019 / 10:42 AM IST

సుకుమార్ -రాంచరణ్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్…. `రంగ‌స్థ‌లం` చిత్రంలో రంగ‌మ్మ‌త్త‌గా నటించి ప్రేక్షకాధరణ పొందింది అన‌సూయ‌. ‘జబర్దస్త్’ షో లో కురచ దుస్తులు వేసుకుని అలాగే ఐటెమ్ సాంగ్స్ తో కుర్రకారుని ఆకర్షించే అన‌సూయ‌లో ఇలాంటి నటి కూడా ఉందని సుకుమార్ పరిచయం చేసాడు. ఈ చిత్రం తరువాత ‘కథనం’ ‘ఎఫ్2’ వంటి చిత్రాలలో నటిస్తుంది అనసూయ. తాజాగా అనసూయకు మరో క్రేజీ ఆఫర్ దక్కినట్టు ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

విషయంలోకి వెళితే.. సుకుమార్ – మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపొందబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మించబోతోంది. ఎప్పటిలాగే సుకుమార్ చిత్రాలకు మ్యూజిక్ అందించే దేవి శ్రీ ప్రసాద్.. ఈ చిత్రానికి కూడా సంగీతమందించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో అనసూయని ఓ పాత్రకి తీసుకోబోతున్నాడట సుకుమార్. ఈ చిత్రంతో.. అన‌సూయలోని న‌టిని మ‌రో స్థాయిలో చూపించే పాత్ర అవుతుంద‌ని టాక్ వినిపిస్తోంది.మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus