రంగస్థలం స్పెషల్ షోల ప్రదర్శనకు అనుమతిచ్చిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.!

  • March 23, 2018 / 10:33 AM IST

ధృవ వంటి హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సుకుమార్ దర్శకత్వంలో “రంగస్థలం” సినిమా చేశారు. పీరియాడిక్ లవ్ స్టోరిగా రూపుదిద్దుకున్న ఈ సినిమా మరో వారం రోజుల్లో రిలీజ్ కాబోతోంది. చరణ్ కి జోడిగా తొలిసారి సమంత నటిస్తుండడం, పాతికేళ్ళనాటి కథ.. వంటి అంశాలు ఈ సినిమాకి క్రేజ్ ని తీసుకొచ్చాయి. అంతేకాదు ఈ మూవీ టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి.

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన ఐదు పాటలు అదరహో అనిపించాయి. మరో సాంగ్ థియేటర్లో చూడమని చిత్ర బృందం ఆసక్తిని పెంచింది. దీంతో ఈ సినిమా థియేటర్స్ రైట్స్ ని డిస్ట్రిబ్యూటర్స్ పోటీ పడి భారీ ధరకి సొంతం చేసుకున్నారు. పెట్టిన ఖర్చు తొందరగా రావడానికి స్పెషల్ షోలు వేయడానికి చిత్ర బృందం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరడంతో.. వెంటనే అనుమతి ఇచ్చింది. సాధారణ నాలుగు ఆటలతో పాటు  ఉదయం 5 గంటల నుంచి 10 గంటల మధ్య కాలంలో అదనపు షో వేయనున్నారు. తెలంగాణలోనూ స్పెషల్ షో కోసం నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ మూవీ మార్చి 30 న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus