షూటింగ్ టైమ్ లోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న కొత్త హీరోయిన్.!

  • March 20, 2018 / 12:45 PM IST

తెలుగు చిత్రసీమలో ఇదివరకూ ముంబై బ్యూటీల తాకిడి ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ ముంబై భామలను మల్లు అందాలు డామినేట్ చేస్తున్నాయి. అందంతోయపాటు అభినయం కూడా సమపాళ్లలో ఉండడంతో ముంబై బ్యూటీలకంటే మల్లు భామలకే దర్శకనిర్మాతలు మాత్రమే కాక హీరోలు కూడా అగ్ర తాంబూలం ఇస్తున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమను ఏలుతున్న సాయిపల్లవి, అను ఎమ్మాన్యూల్, నివేదా థామస్, అనుపమ పరమేశ్వరన్, నివేతా పేతురాజ్ వంటి భామలందరూ కేరళ కుట్టిలే కావడం విశేషం.

ఇప్పుడు వీరి కోవలో మరో అందాల భామ చేరనుంది. అంజు కురియన్ అనే మల్లు భామ త్వరలో తెలుగు తెరకు పరిచయం కానుంది. ఆల్రెడీ మలయాంలో నాలుగు సినిమాలు, తమిళంలో ఒక సినిమా చేసి నటిగా ప్రూవ్ చేసుకొన్న ఈ అమ్మడు ప్రస్తుతం సుమంత్ సరసన నటిస్తోంది. సుమంత్ హీరోగా అనిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ థ్రిల్లర్ చిత్రంలో అంజు కురియన్ కథానాయికగా నటిస్తోంది. ఆల్రెడీ అమ్మడి పెర్ఫార్మెన్స్ గురించి డిస్కషన్స్ మొదలయ్యాయి. ఎంతటి కష్టమైన సన్నివేశమైనా సరే సింగిల్ టేక్ లో ఫినిష్ చేస్తుందని, సుమంత్ సినిమా విడుదలైతే అమ్మడి కోసం ఆఫర్లు క్యూ కట్టడం ఖాయమంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus