మరో టీజర్ తో అరవింద సమేత టీం సిద్ధం

  • August 23, 2018 / 09:53 AM IST

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫ్యాక్షన్ ఎంటర్ టైనర్ “అరవింద సమేత” టీజర్ విడుదల చేయడం, ఆ టీజర్ వ్యూస్ పరంగా, క్రేజ్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించడం తెలిసిందే. ఫస్ట్ లుక్ తోనే భారీ అంచనాలను పెంచేసిన త్రివిక్రమ్ టీజర్ తో ఆ అంచనాలను అందలం ఎక్కించాడు. టీజర్ లో ఎన్టీయార్ మాస్ అవతార్, చిత్తూరు యాసలో చెప్పిన డైలాగ్ నందమూరి అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకోవడంతోపాటు ప్రేక్షకులు సినిమా కోసం ఎదురుచూసేలా చేసింది.

దసరా కానుకగా విడుదలకానున్న “అరవింద సమేత” సెకండ్ టీజర్ ను వినాయక చవితి లేదా సెప్టెంబర్లో విడుదల చేసేందుకు త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ టీజర్ లో ఎన్టీయార్ తోపాటు సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్న పూజా హెగ్డే, నాగబాబు మరియు ఇతర పాత్రధారుల ఇంట్రడక్షన్ కూడా ఇవ్వనున్నాడట త్రివిక్రమ్. ఈ వార్త గనుక నిజమే అయితే ఎన్టీఆర్ అభిమానులకు పండగ దసరా కంటే ముందు ప్రారంభం అవ్వడం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus