చిరు, బాలయ్యలతో మల్టీ స్టారర్ మూవీ చేయాలంటున్న యువ దర్శకుడు

  • February 27, 2018 / 07:03 AM IST

కలని కనడం.. ఆ కలని నెరవేరేవరకు విశ్రాంతి తీసుకోకుండా శ్రమించడం విజేతల లక్ష్యం. అయితే కొన్ని కలలు నెరవేరడం అసాధ్యంగా అనిపిస్తుంది. అటువంటి అసాధ్యమైన ‘అ!’ సినిమాని తెరకెక్కించి ఔరా అనిపించారు యువ డైరక్టర్ ప్రశాంత్ వర్మ. కథే హీరోగా నలుగురు హీరోయిన్స్ ని పాత్రలుగా మలిచి “అ!” సినిమాని రూపొందించి ప్రసంశలు అందుకున్నారు. భారీ బడ్జెట్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించడమే కష్టమైన తరుణంలో నలుగురు అగ్ర కథానాయికలను ఒప్పించి మెప్పించారు. నాని నిర్మించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను రాబట్టింది.

ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన ప్రశాంత్ వర్మ మరో కల ని బయటపెట్టారు. తనకు మల్టీ స్టారర్ సినిమా చేయాలని ఉందని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణలను ఒకే ఫ్రేమ్ లో చూపించాలని ఉందని వెల్లడించారు. ఈ కాంబినేషన్ కోసం ఎంతోమంది సీనియర్ దర్శకులు ప్రయత్నించి వెనక్కి తగ్గారు. అసాధ్యమని చెప్పేవారు లేకపోలేదు. అటువంటి కాంబినేషన్ లో సినిమా తీయడమే తన డ్రీమ్ అని చెప్పి “అ” అనిపించారు. మరి తన ప్రతిభతో స్టార్ హీరోలను ఒప్పించి.. మెప్పిస్తాడేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus