మోక్షజ్ఞ విషయంలో బాలయ్య ఫైనల్ డెసిషన్ అదేనా..?

  • June 15, 2020 / 12:10 PM IST

బాలకృష్ణను వైవిద్యమైన కోణంలో చూపించిన చిత్రాల్లో ‘ఆదిత్య 369’ కూడా ఒకటి..! సింగీతం శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ బ్లాక్ బస్టర్ చిత్రంలో బాలకృష్ణ… కృష్ణ కుమార్ గాను అలాగే శ్రీకృష్ణ దేవరాయ గాను.. రెండు విభిన్నమైన పాత్రలను పోషించి ప్రశంసలు అందుకున్నాడు. టెక్నాలజీ లేని రోజుల్లోనే ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు సింగీతం శ్రీనివాసరావు. ఈ చిత్రానికి సీక్వెల్ చెయ్యాలని ఎప్పుడో కథను సిద్ధం చేసుకున్నాడట. బాలయ్యకు కూడా కథ వినిపించాడట. అయితే ఈ స్క్రిప్ట్ ను సింగీతంతో కాకుండా.. ఓ యంగ్ డైరెక్టర్ తో రూపొందించాలని బాలయ్య అనుకుంటున్నాడట.

నిజానికి బాలయ్యనే ఈ సీక్వెల్ లో కూడా నటిస్తాడు అంటూ ప్రచారం జరిగింది. అంతేకాదు తన కొడుకు మోక్షజ్ఞ కోసం ఓ చిన్న పాత్రను కూడా డిజైన్ చేయించాడట. ఈ పాత్ర ద్వారా ప్రేక్షకులకు మోక్షజ్ఞను పరిచయం చెయ్యాలి అనేది బాలయ్య ప్రధాన ఉద్దేశం. తరువాత మంచి మాస్ స్క్రిప్ట్ తో ఫుల్ లెంగ్త్ హీరోగా మోక్షజ్ఞను ప్రెజెంట్ చేద్దాం అని కూడా బాలయ్య ప్లాన్ చేసుకున్నాడట. అయితే ఇప్పుడు ఆ ఆలోచనని మార్చుకున్నాడని తెలుస్తుంది.

‘ఆదిత్య 369’ సీక్వెల్ లో కంప్లీట్ హీరోగా మోక్షజ్ఞను పరిచయం చేసి.. అందులో గెస్ట్ రోల్ ను బాలయ్య చెయ్యాలనుకుంటున్నాడట. అందుకోసం దర్శకుడితో కొన్ని మార్పులు కూడా చేయిస్తున్నాడట బాలయ్య. అన్నీ అనుకున్నట్టు కుదిరితే వచ్చే ఏడాదే.. ‘ఆదిత్య 369’ సీక్వెల్ ను సెట్స్ పైకి తీసుకువెళ్ళాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus