పోర్చుగల్ కి వెళ్లనున్న బాలయ్య, పూరి బృందం

  • May 2, 2017 / 10:49 AM IST

ఎండలను సైతం లెక్క చేయకుండా బాలకృష్ణ శ్రమిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. బాలయ్య, డ్యాన్సర్లపై ఒక పాట ను  చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ పూర్తికాగానే రెస్ట్ తీసుకోకుండా తదుపరి షెడ్యూల్ ను పోర్చ్ గల్ లో ప్రారంభించనున్నారు. 40 రోజుల పాటు సాగె ఈ షెడ్యూల్ లో కొన్ని సీన్లు, మూడు పాటలతో పాటు ఓ భారీ ఫైట్ ని తెరకెక్కించనున్నారు. పూరి జగన్నాథ్ స్టైల్లో హెలికాఫ్టర్ తో కూడిన ఈ యాక్షన్ ఎపిసోడ్ ను హాలీవుడ్ నిపుణుల పర్వవేక్షన్లో షూట్ చేయనున్నట్లు తెలిసింది.

ఇది వరకు బాలయ్య ఏ సినిమాలో చేయని విధంగా ఈ ఫైట్ ఉంటుందని సమాచారం. నందమూరి అభిమానులకు ఈ ఫైట్ బాగా నచ్చుతుందని చిత్ర బృందం ధీమాగా చెబుతోంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలయ్య సరసన శ్రీయ, ముస్కాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ఉస్తాద్ అనే టైటిల్ పరిశీలిస్తున్న ఈ సినిమాలో సెప్టెంబర్ 29న రిలీజ్ కానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus