ఎన్టీఆర్ బయోపిక్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

  • August 31, 2017 / 06:34 AM IST

మహా నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జీవిత చరిత్రపై సినిమాను తీస్తానని ఆయన తనయుడు నటసింహ నందమూరి బాలకృష్ణ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ఆయన బాల్యం, యవ్వనంలో సంగతులు, విశేషాలపై పరిశోధనకు ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.  ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటించనున్న ఈ మూవీ ఆగిపోయిందని కొన్ని రోజులుగా ప్రచారం సాగింది. దీనిపై బాలకృష్ణ ఈరోజు క్లారిటీ ఇచ్చారు. అయన నటించిన పైసా వసూల్ చిత్ర ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. ” నాన్నగారి సినిమా ఆగిపోలేదు. స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఈ సినిమా కోసం మా బంధువులను, మా తండ్రి సహచరుల్ని, ఆయన వద్ద పని చేసిన అధికారుల్ని కలిసి వివరాలు సేకరించాను. రెండు మూడు రోజుల్లో ఈ చిత్ర దర్శకుడిని ప్రకటిస్తాము. సినిమా త్వరలోనే ప్రారంభిస్తాము” అని స్పష్టం చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సినీ నటుడిగా కాకముందు విశేషాలు చూపిస్తామని, అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయని వివరించారు. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన  పైసావసూల్ రేపు గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus