తన అభిమాన హీరోల గురించి చెప్పిన భాను

  • July 20, 2018 / 05:02 PM IST

వరంగల్ అమ్మాయి భాను శ్రీ బహుబలి బిగినింగ్ సినిమాలో నటించినప్పటికీ ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ సీజన్ 2షో లో పాల్గొన్న తర్వాత ఆమె గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. బాహుబలి లో తమన్నా పక్కన నటించిన ఈ బ్యూటీ కుమారి 21 ఎఫ్ లోను మెరిసింది. రామ్ చరణ్ ఎవడు మూవీలోనూ కాసేపు కనిపించింది. బిగ్ బాస్ సీజన్ 2షో లో అవకాశం రావడంతో వెళ్ళింది. అక్కడ తన మాట దురుసు తో నాలుగు వారాలకే బయటికి వచ్చింది. అయినా ఎక్కువమంది మనసులను దోచుకుంది. ఈ సందర్భంగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. తనకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని తెలిపింది.

“నేను పవన్ కళ్యాణ్ గారి కాటమరాయుడు సినిమాలో నటించాను. అజయ్ కి గర్ల్ ఫ్రెండ్ గా చేసాను. ఆ సమయంలో పవన్ సార్ ని చూసి మురిసిపోయేదాన్ని. సెట్ లో చాలా క్రేజీగా ఉండేది. బహుశా మగాడిగా ఉండే ఆలా ఉండేదాన్నేమో. పవన్ సెట్ లోకి వస్తే నోరుతెరిచి చూస్తూ ఉండిపోయేదాన్ని” అంటూ వివరించింది. ఇంకా మాట్లాడుతూ “తెలుగులో హీరోలందరూ ఇష్టమే. అయితే పవన్ గారు, ప్రభాస్ గారు అంటే పిచ్చి” అని భానుశ్రీ చెప్పింది. బిగ్ బాస్ షో వల్ల వచ్చిన గుర్తింపుతో మరిన్ని సినిమా ఛాన్సులను భానుశ్రీ అందుకోనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus