రాశీ ఖన్నా, ఎన్టీఆర్ లపై సాంగ్ చిత్రీకరిస్తున్న బాబీ

  • August 23, 2017 / 09:41 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పీడ్ అని అందరికీ తెలుసు. మరి ఇంత స్పీడ్ అని ఎవరికీ తెలియదు. బాబీ దర్శకత్వంలో తాను చేస్తున్న జై లవకుశ సినిమా టాకీ పార్ట్ ని పూర్తి చేశారు. శని, ఆదివారాల్లో బిగ్ బాస్ షో లో అదరగొడుతున్నారు. ఆ షో షూటింగ్ ముగిసిన వెంటనే జై లవకుశ చిత్రానికి డబ్బింగ్ మొదలెట్టారు. డబ్బింగ్ కి కాసేపు బ్రేక్ ఇచ్చి రొమాన్స్ కి సిద్ధమైపోయారు. హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో వేసిన అందమైన సెట్ లో రాశీ ఖన్నా, తారక్ పై రొమాంటిక్ సాంగ్ షూటింగ్ ఈ రోజు మొదలయింది. మూడు రోజుల్లో ఈ పాటను పూర్తి చేయాలనీ చిత్ర బృందం భావిస్తోంది. వినాయక చవితి రోజు కూడా బాబీ బృందం షూటింగ్ లో పాల్గొననుంది.

ఎందుకంటే శనివారం మళ్ళీ ఎన్టీఆర్ ముంబై కి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడే రెండు రోజులు ఉండి బిగ్ బాస్ షూటింగ్ లో పాల్గొని హైదరాబాద్ కి రానున్నారు. ఇలా సినిమా, షోలను నడిపిస్తున్నారు. జై లవకుశను ఎలాగైనా సెప్టెంబర్ 21 న రిలీజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ రెస్ట్ తీసుకోకుండా కష్టపడుతున్నట్లు  చిత్ర బృందం వెల్లడించింది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus