శ్రీదేవి సినిమాపై సీరియస్ అయిన బోణీ కపూర్

  • January 16, 2019 / 12:58 PM IST

శ్రీదేవి చనిపోయినప్పట్నుంచి ఆమె గురించి, ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్ గురించి రోజూ ఏదో ఒక వార్త వింటూనే ఉన్నాం. తొలుత శ్రీదేవికి అపూర్వమైన అభిమాని అయిన రాంగోపాల్ వర్మ ఓ బయోపిక్ ను ప్రకటించగా.. అనంతరం టాలీవుడ్ మరియు కోలీవుడ్ నుంచి కూడా కొన్ని చిత్రాలు ఎనౌన్స్ చేయబడ్డాయి. వాటిలో ఏ ఒక్కటీ కనీసం సెట్స్ కు కూడా వెళ్లలేదనుకోండి అది వేరే విషయం.

అయితే.. నిన్న సాయంత్రం సడన్ గా వింక్ బ్యూటీ ప్రియప్రకాష్ వారియర్ నటించిన “శ్రీదేవి బంగ్లా” అనే సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆమె దివంగత నటి శ్రీదేవి పాత్ర పోషిస్తోంది. టీజర్ చివర్లో శ్రీదేవి ఎలా అయితే చనిపోయిందో అదే తరహాలో బాత్ టబ్ లో ప్రియా వారియర్ పడుకొని ఉన్నట్లుగా కాళ్ళు చూపించడంతో అసలు పర్మిషన్ అనేది తీసుకోకుండా, ఏం తెలుసని ఆ సంఘటనల ఆధారంగా సినిమా తీస్తున్నారు అంటూ శ్రీదేవి భర్త బోణీకపూర్ “శ్రీదేవి బంగ్లా” టీం పై ఫైర్ అయ్యాడు. పెద్దాయన అక్కడితో ఆగలేదు, ఇమ్మీడియట్ గా కోర్ట్ నోటీసులు కూడా పంపాడట. దాంతో తన మొదటి సినిమానే దిక్కు తోచని స్థితిలో పడేసరికి కంగారు పడుతోంది ప్రియప్రకాష్ వారియర్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus