అమలా పాల్ పై కేసు నమోదు .. ఆ సీన్లే కారణమా?

  • July 18, 2019 / 09:54 PM IST

తమిళ చిత్రసీమలో వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రెస్ అంటే.. అమలా పాల్ పేరే గుర్తొస్తుంది. సినిమాలు చేసినా చేయకపోయినా… నిత్యం ఏదో ఒక వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటుంది. ఇదిలా ఉండగా.. ఈమె నటించిన తాజా చిత్రం ‘ఆడై’. జూలై 19 న విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని తెలుగలో ‘ఆమె’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టేజర్లో.. నగ్నంగా కనిపించి అందరికీ షాకిచ్చింది అమల. ఇలా నగ్నంగా నటించడాన్ని కొంతమంది తప్పుపడితే.. ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ రాంగోపాల్ వర్మ, సమంత లాంటి వాళ్ళు ప్రసంసలు కురిపించారు. ఇది పక్కన పెడితే.. మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రం పై కేసు నమోదవ్వడం సంచలనంగా మారింది.

విషయం ఏమిటంటే.. అమల నగ్నంగా ఉంటూ టేప్ చుట్టుకుని ఉన్న ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇదే లుక్ తో పోస్టర్లు కూడా వచ్చాయి. దీంతో ప్రియా రాజేశ్వరి అనే రాజకీయ నాయకురాలు.. అమలా పాల్ పై కేసు పెట్టింది. ‘అమలా పాల్ వల్ల తమిళ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు హిందూ ధర్మానికి విఘాతం కలుగుతుంది. కేవలం డబ్బుల కోసమే అమల ఇలా చేస్తుంది. ఆమె పబ్లిసిటీ కోసమే ఇలా నటించింది. యువతను కూడా పక్క దారి పట్టించేలా ‘ఆడై’ చిత్రంలో సీన్లు ఉన్నాయి. ఇలాంటి సినిమాల వల్లే అత్యాచారాలు ఎక్కువైపోతున్నయి. వెంటనే ఈ చిత్రంలో అమలాపాల్ సీన్లని
తొలగించాలి. ఆలా ఉన్న పోస్టర్లను పబ్లిసిటీకి ఉపయోగించవద్దని ఇదివరకే పోలీసులు నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లను ఆదేశించారు. అయినప్పటికీ ఇలా నగ్నంగా ఉన్న పోస్టర్లతో ప్రమోషన్స్ చేసినందుకు.. అమలా పాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని’ కంప్లైంట్లో పేర్కొంది’ ప్రియా రాజేశ్వరి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus