‘మెహబూబా’ సెన్సార్‌ పూర్తి – మే 11 విడుదల

  • May 3, 2018 / 01:58 PM IST

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆకాష్‌ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై పూరి కనెక్ట్స్‌ నిర్మిస్తున్న చిత్రం ‘మెహబూబా’. మే 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవుతోంది. హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు… శ్రీ వెంకటేశ్వర ఫిలింస్‌ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది.

ఈ సందర్భంగా ఛార్మి మాట్లాడుతూ ”మా సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. సెన్సార్‌ సభ్యులందరికీ సినిమా చాలా బాగా నచ్చిందని చెప్పారు. ఆకాష్‌ చాలా బాగున్నాడు, లవ్‌ స్టోరీ చాలా బాగుంది అని పదే పదే చెప్పడంతో మాకు చాలా ఎనర్జీ వచ్చింది. సినిమాపై మరింత కాన్ఫిడెన్స్‌ వచ్చింది. ఈ సందర్భంగా సెన్సార్‌ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మే 11న ప్రపంచవ్యాప్తంగా మా ‘మెహబూబా’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం” అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus