భరత్ అనే నేను స్క్రిప్ట్ లో మార్పులు చేసిన కొరటాల?

  • December 14, 2017 / 07:19 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “భరత్ అనే నేను” సినిమా చేస్తున్నారు. ఈ  సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. కొత్త షెడ్యూల్ ఈరోజు  తమిళనాడులోని కారైకుడిలో మొదలయింది. అక్కడ ఒక ఫైట్ తో పాటు కొన్ని సీన్స్ తెరకెక్కించనున్నారు. దీంతో 75 శాతం షూటింగ్ పూర్తవుతుంది. మిగిలిన మూడు పాటలు, ఇతర సన్నివేశాలను జనవరిలో చిత్రీకరించనున్నారు. అయితే ఇప్పటివరకు చిత్రించిన కొన్ని సన్నివేశాలను తొలిగిస్తున్నట్టు తెలిసింది. ఎడిట్ తర్వాత సినిమాని చూసుకున్న కొరటాల షాక్ అయ్యారంట.

ఇది రానా లీడర్ సినిమాని గుర్తుకుతెచ్చిందని సమాచారం. అలాగే ప్రేక్షకుడు కూడా ఫీలవుతాడని భావించిన డైరక్టర్ కొన్ని సన్నివేశాలను తొలిగించడానికి సిద్ధమయ్యారని చిత్ర బృందం తెలిపింది. ఆ స్థానంలో కొత్త సీన్లు యాడ్ చేయనున్నారు. అలాగే తమిళ చిత్రం మెర్సల్ (అదిరింది) మూవీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కొన్ని డైలాగ్స్ కూడా ఇందులో కొరటాల రాసుకున్నారు. వాటిని కూడా తీసేసి కొత్త డైలాగులు రాసుకోనున్నట్టు సమాచారం. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ తెలుగులో పరిచయమవుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న భరత్ అనే నేను 2018 ఏప్రిల్ 27న విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus