ఏప్రిల్ లో మొదలుకానున్న చిరు కొత్త మూవీ

  • February 16, 2017 / 11:35 AM IST

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ చిత్రంతో పూర్వవైభవాన్ని సొంతం చేసుకున్నారు. ఖైదీ నంబర్ 150 సినిమా ద్వారా కలక్షన్లో, రెమ్యూనరేషన్లో  బిగ్ బాస్ తానే అని నిరూపించుకున్నారు. ఈ మూవీ ఇచ్చిన ఉత్సాహంతో 151 సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ ఫిల్మ్ ని కూడా రామ్ చరణే నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చెర్రీకి ధృవ వంటి సూపర్ హిట్ ఇచ్చిన స్టైలిష్ డైరక్టర్ సురేందర్ రెడ్డి కే మెగాస్టార్ కొత్త సినిమా బాధ్యతలను అప్పగించారు. స్వాతంత్ర సమరయోధుడు  ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోంది. ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ ఈ కథకు భారీ డైలాగులు జోడించే పనిలో ఉన్నారు.

ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ ని నిర్మాత రామ్ చరణ్ ఫిక్స్ చేశారు. తాజా ఈ సినిమా ప్రారంభం విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఏప్రిల్ నుంచి సెట్స్ మీదకు తీసుకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ కథ 1840 లో జరిగింది కావున ఆనాటి వాతావరణాన్ని కళ్లకు కట్టేందుకు మగధీర, బాహుబలి కి గ్రాఫిక్స్ హంగులు అందించిన కనల్ కణ్ణన్  ని తన టీమ్ లోకి నిర్మాత తీసుకున్నారు. హిస్టారికల్ మూవీ కావున ఈ చిత్రం కంప్లీట్ కావడానికి 8  నెలలు సమయం పడుతుందని, ఈ చిత్రాన్ని 2018 సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ చెర్రీ ఆలోచనలో ఉన్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus