చిరంజీవి లేటెస్ట్ లుక్ అందుకోసమేనా ?

  • June 12, 2017 / 07:27 AM IST

దర్శకరత్న దాసరి నారాయణరావుకి తెలుగు సినీ పరిశ్రమ ఘనంగా సంతాపం ప్రకటిస్తూ.. శనివారం ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో అనేకమంది సినీ ప్రముఖులు పాల్గొని ఆయన్ను గుర్తుచేసుకున్నారు. చిరంజీవి కూడా దాసరితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దాసరిని కడసారి చూసుకునే అవకాశం దక్కకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో చిరు చైనా పర్యటనలో ఉన్నారు. రీసెంట్ గా హైదరాబాద్ కి వచ్చారు. వచ్చిన వెంటనే దాసరి సంతాప సభకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిరు మాటలు గురించి కంటే అతని లుక్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మీసాన్నీ మెలితిప్పి, గడ్డాన్ని పెంచి చాలా అందంగా కనిపించారు. ఈ లుక్ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చిత్రం కోసమే అని అభిమానులు భావిస్తున్నారు.

తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించేందుకు చిరు సిద్ధమవుతున్నారు. రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం  సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకోనుంది. ఇందుకోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన డైరక్టర్, చిరంజీవి లుక్, సెట్స్ పై ద్రుష్టి సారిస్తున్నారు. అందులో భాగంగానే కత్తి సాము, గుర్రపు స్వారీ లో చిరు శిక్షణ తీసుకుంటున్నారు. ఆగస్టు నాటికీ ప్రీ ప్రొడక్షన్ పక్కాగా పూర్తి అయ్యేలా చిత్ర బృందం శ్రమిస్తోంది. చిరు పుట్టిన రోజు ఆగస్టు 22 న అయన 151 సినిమాకి తొలి క్లాప్ పడనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus