అయ్యో మెగాస్టార్ కూడా కరోనా భారిన పడ్డారుగా..!

  • November 9, 2020 / 11:11 AM IST

కరోనా ప్రభావం తగ్గింది అని అంతా అనుకుంటూ.. జనాలంతా బయట విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. అయితే వరుసగా పెద్ద పెద్ద వాళ్ళే దీని భారిన పడుతుండడం ఆందోళన కలిగించే విషయం. మొన్నటికి మొన్న తమన్నా, రాజశేఖర్ వంటి వారు దీని భారిన పడ్డారు. రాజశేఖర్ కు అయితే చాలా సీరియస్ అయ్యింది. ఇదిలా ఉండగా.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా భారిన పడటం ఆయన ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతుంది. కొద్దిసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి.. తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసారు.

చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ” ‘ఆచార్య’ షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను” అంటూ పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ను అలాగే ఎం.పి.సంతోష్ కుమార్, నాగార్జున వంటి ప్రముఖలను కలిశారు. ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ గా మారింది. ‘చిరు త్వరగా కోలుకోవాలని’ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.


Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus