రానా చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వనున్న చిరంజీవి, సూర్య

  • January 28, 2017 / 06:51 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి బాహుబలి చిత్రంలో విలన్ గా అదరగొట్టిన దగ్గుబాటి రానా కథానాయకుడిగా నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రానా ద్విభాషా చిత్రం ‘ఘాజీ’లో హీరోగా నటించారు. 1971 వ సంవత్సరంలో ఇండియా-పాకిస్తాన్ యుద్ధ కథాంశంతో  హిందీ, తెలుగులో నిర్మితమైన ఈ మూవీ మూడు భాషల్లో రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 17న విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రత్యేక హంగులు జోడిస్తున్నారు. మూవీ ప్రారంభంలో వచ్చే వాయిస్ ఓవర్ ను స్టార్ హీరోలు ఇవ్వనున్నారు.

తెలుగు వెర్షన్ కి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తుండగా, తమిళ వెర్షన్ కి తమిళ స్టార్ హీరో సూర్య  గొంతు అరువు ఇవ్వనున్నారు. త్వరలో వీరి వాయిస్ రికార్డ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. పీవీపీ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ తాప్సి హీరోయిన్ గా నటించింది. ఎక్కువశాతం సముద్రం అడుగుభాగంలో చిత్రీకరణ జరుపుకున్న మూవీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని హీరో రానా చెప్పారు. ఇందులో భల్లాల దేవా నేవీ ఆఫీసర్ గా ఆకట్టుకోనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus