హీటెక్కిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య కోల్డ్ వార్

  • January 21, 2017 / 12:59 PM IST

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య కొన్నేళ్లుగా కోల్డ్ వార్ నడుస్తోంది. కొన్ని రోజుల క్రితం జరిగిన ఖైదీ నంబర్ 150 మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయినా, పవన్ రాలేదు.   చిరు భార్య సురేఖ, తనయుడు రామ్ చరణ్ తేజ్ ప్రత్యేకంగా ఆహ్వానించినప్పటికీ పవన్ రాకపోయేసరికి.. వారిద్దరి మధ్య నున్న దూరం బయటపడింది. అంతేకాదు మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ కి ఈ ఫంక్షన్ దూరం మరింత పెంచింది. తమ్ముడు తమలో కలుస్తాడని ఎంతగానో ఎదురుచూస్తున్న చిరంజీవికి సహనం నశించిందని సమాచారం. పవన్ ని పక్కన పెట్టాలని ఫిక్స్ అయినట్లు తెలిసింది.

ఖైదీ నంబర్ 150 ఘన విజయం సాధించడంతో మెగా ఫ్యామిలీ గ్రాండ్ గా థాంక్స్ గివింగ్ మీట్” ని త్వరలో నిర్వహించనుంది. ఈ ఈవెంట్ కి పవన్ ని ఆహ్వానించకూడదని, అసలు కార్యక్రమంలో పవన్ మాట వినిపించకుండా ఉండాలని   అందరికీ ఆజ్ఞలు జారీ చేశారని టాక్. మీడియా ప్రతినిధులకు సైతం పవన్ గురించి తనని ఏ ప్రశ్న అడగకుండా ఉండాలని కోరినట్లు ఫిల్మ్ నగర్లో గాసిప్ లు చక్కర్లు కొడుతోంది. ఈ విషయంలో ఎంతవరకు నిజముందో త్వరలో తెలియనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus