కథని మలుపుతిప్పనున్న కళాశాల సన్నివేశాలు

  • July 17, 2018 / 07:04 AM IST

భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు మరింత ఉత్సాహంతో నెక్స్ట్ సినిమాని చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర మొదటి షెడ్యూల్ డెహ్రాడూన్ లోని కాలేజ్ లో జరిగింది. రెండో షెడ్యూల్ అమెరికాలో సాగనుంది. త్వరలోనే చిత్ర బృందం అమెరికాకి వెళ్లనుంది. అల్లరి నరేష్ కీలకరోల్ పోషిస్తోన్న ఈ చిత్రానికి “రాజసం”, “రైతుబిడ్డ” అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. డీజే బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా గురించి ఆసక్తికర సంగతి బయటికి వచ్చింది. కాలేజీలో చిత్రీకరించిన సన్నివేశాలే సినిమాలో హైలెట్ కానున్నాయని స‌మాచారం.

కాలేజ్ స్టూడెంట్‌గా ఉన్న మహేష్ రైతు సమస్యల పట్ల ఎలా ఆకర్షితుడవుతాడు… వారి సమస్యలను తీర్చ డానికి ఎటువంటి ప్రణాళికలు వేయాలో ఆలోచన కలగడానికి ఇక్కడే బీజం ఏర్పడుతుందని తెలిసింది. ఆ సన్నివేశాలను వంశీ కొత్తాగా తెరకెక్కించినట్లు టాక్. వచ్చే నెల 9 న మహేష్ బాబు పుట్టినరోజు. ఆరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ మహేష్ 25 వ మూవీ టైటిల్ ని రివీల్ చేయనున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus