మల్టీస్టారర్ మూవీ కోసం భారీ ఖర్చుతో కాలనీ సెట్ నిర్మాణం

  • April 28, 2018 / 03:51 PM IST

తెలుగు సినిమా పరిశ్రమ అనేక విధాలుగా అభివృద్ధి చెందుతోంది. నిర్మాణంలో నాణ్యత పెరుగుతోంది. కథకి అనుగుణంగా ప్రాంతాలను వెతకడమే కాదు.. అవసరమైతే ఆ ప్రాంతాన్ని సృష్టిస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత అనేక చిత్రాలకు పెద్ద సెట్స్ వేస్తున్నారు. రీసెంట్ గా రంగస్థలం సినిమా కోసం ఆ గ్రామ సెట్ నే నిర్మించారు. ఆ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలయికలో వస్తున్న మూవీ కోసం కూడా రాయలసీమలోని ఓ విలేజ్ సెట్ ని నిర్మించారు. తాజాగా డైరక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న నాని, నాగార్జున మల్టీ స్టారర్ చిత్రానికి ఓ కాలనీ సెట్ ని వేశారు. ఇందుకోసం కోటి రూపాయలు ఖర్చు అయినట్లు తెలిసింది. రెండు నెలలు కష్టపడి ఈ కాలనీని సృష్టించారు. ఈ మూవీ మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోని మియాపూర్ మెట్రో స్టేషన్లో జరిగింది.

నాని, రష్మిక మందన్న, సంపూర్ణేష్ బాబులపై సన్నివేశాలు చిత్రీకరించారు. సెకండ్ షెడ్యూల్ ఈ కాలనీలో మే 2 నుంచి మొదలుకానుంది. మే 10 నుంచి ఈ షూట్ లో నాగ్ పాల్గొంటారు. అప్పుడు నాని, నాగార్జున కాంబో సీన్స్ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో నాగ్ సరసన కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినిదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాని డాక్టర్ పాత్రలో కనిపిస్తున్నాడు. నాగార్జున డాన్ పాత్రలో అలరించబోతున్నాడు. కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus