బాలయ్య అభిమానులకు స్వారీ చెప్పిన పృధ్వి..!!

  • July 30, 2016 / 07:48 AM IST

థర్టీ ఇయర్స్ పృథ్వీ. ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ కమేడియన్ అనడంలో డౌట్ అక్కర్లేదు. గతంలో బ్రహ్మనందం  కోసం కాన్సెప్ట్ లు, క్యారెక్టర్లు తయారుచేసినట్లే, ఇప్పుడు  పృథ్వీ కోసం సిద్ధం చేస్తున్నారు. ‘సెల్ఫీ రాజా’లో పృథ్వీ మంచి క్యారెక్టరే చేశారు. ‘చెప్పను బ్రదర్..’ అంటూ బన్నీని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆయన జక్కన్న సినిమాలో చేసిన పాత్ర నందమూరి అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయి.

బాలకృష్ణ ను అవమానించేలా పృథ్వీ నటించారని కోప్పడ్డారు. దీంతో ఈ నటుడు బాలయ్య అభిమానులకు క్షమాపణ  చెప్పారు. అయన స్వయంగా వివరణ ఇచ్చుకున్నారు. ఒక వీడియోని తన ఫెస్ బుక్  అకౌంట్ లో పోస్ట్ చేశారు. అందులో పృథ్వీ మాట్లాడుతూ ” నేను చేసిన కటకటాల కట్టప్ప పాత్రలో బాలయ్య షేడ్స్ ఉన్నాయని, అయన అభిమానులు చెప్పడం నన్ను చాలా బాధించాయి. మీకు లాగే నాకు బాలకృష్ణ దేవుడు లాంటి వారు. నేను భక్తుడను. ఆయన మాటలను జనాల్లోకి తీసుకువెళదామనే ఉద్దేశంతో కొన్ని డైలాగులు చెప్పాను. అంతే తప్ప ఆయన్ను కించపరచాలని కాదు.

మహానటుడు నందమూరి రామారావు తనయుడు, వంద చిత్రాల చేసిన నటసింహ బాలకృష్ణ నటన చూస్తే నాకు పూనకం వస్తుంది. అయన నాకు స్ఫూర్తి. బాలయ్య లెజెండ్, డిక్టేటర్. ఆయన ముందు నేనెంత. ఆయనతో నాకు మంచి స్నేహం ఉంది. ఈ సంఘటన జరగడం బాధాకరం. మరో సారి అలా అనుకరించను.” అని చెప్పారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus