“నేనే రాజు నేనే మంత్రి” కథ రచయిత తేజ కాదంట!

వరుస అపజయాలతో సతమవుతున్న డైరక్టర్ తేజ “నేనే రాజు నేనే మంత్రి”  సినిమాతో విజయాన్ని అందుకున్నారు. ప్రేమ కథలతో మ్యాజిక్ చేసే ఈ డైరక్టర్ ఈ చిత్రంలో ప్రేమకు కొంచెం పాలిటిక్స్ జోడించి హిట్ కొట్టారు. సినిమాని బాగా తీశారని తేజ ఓ వైపు అభినందనలు అందుకుంటుంటే..  మరోవైపు విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. “నేనే రాజు నేనే మంత్రి” కథ తేజ రాయలేదని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఈ సినిమా కథను తిమ్మా రెడ్డి అనే ఒక రచయిత రాసారని, ఈ కథ స్క్రిప్ట్ రూపంలో మారే వరకు తేజతో అతను ట్రావెల్ అయినట్లు సమాచారం.

సినిమా మొదలవ్వగానే తిమ్మా రెడ్డి ని తేజ పక్కన పెట్టడం మొదలు పెట్టారని, టైటిల్ కార్డు వేస్తామని చెప్పినప్పటికీ, ఆ మాటను తేజ తప్పారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిమ్మా రెడ్డి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఈ విషయంపై పోరాడేందుకు ముందుకు రాలేదని అంటున్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus