ప్రభాస్ పోస్ట్ పై దీపికా పడుకొనె కామెంట్స్?

  • July 23, 2020 / 09:03 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అటు తరువాత ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో కూడా ఓ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ సినిమాగా నిర్మించడానికి అశ్వినీ దత్ ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్ కూడా 400కోట్లు కేటాయించినట్టు ప్రచారం జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనె ను ఫిక్స్ చేసినట్టు కూడా.. ఈ మధ్యనే ప్రకటించారు.

ఈ చిత్రం కోసం ఆమె 15 కోట్ల పారితోషికం అందుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ‘ప్రభాస్ 21’ లో ఆమె హీరోయిన్ గా నటిస్తుంది అని దర్శకనిర్మాతలు ప్రకటించగానే ఈ చిత్రానికి ‘బాహుబలి’ రేంజ్ హైప్ వచ్చేసిందనే చెప్పాలి. ఇక దీపికతో నటించాలని ఉందని ప్రభాస్ కూడా ‘బాహుబలి’ ప్రమోషన్స్ టైములో చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నందుకు ‘దీపికాతో కలిసి వర్క్‌ చేయబోతుండడం.. నాకు ఎంతో ఎక్సైటింగ్ గా ఉంది.

వెల్కమ్’ … అంటూ ప్రభాస్ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు. ప్రభాస్ పోస్ట్ పై దీపికా స్పందిస్తూ.. ‘మీ వెల్కమ్ కు థాంక్స్. ఈ గొప్ప ప్రయాణం కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ …అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులని ఎంపిక చేసుకునే పనిలో దర్శకనిర్మాతలు బిజీగా ఉన్నట్టు సమాచారం.

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus