మెగా మల్టీ స్టారర్ మూవీకి దర్శకుడిగా త్రివిక్రమ్ ఖరారు

  • May 29, 2017 / 05:59 AM IST

కొన్ని రోజులుగా మెగా మల్టీ స్టారర్ మూవీ తెలుగు ప్రేక్షకులను ఊరిస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త, ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించగానే మెగా అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆ తర్వాత పవన్ ఆ ప్రాజక్ట్ గురించి తెలియదనగానే నిరుత్సాహపడ్డారు. కళాబంధు సుబ్బిరామిరెడ్డి మాత్రం చిరంజీవి, పవన్ కళ్యాణ్ ని ఒకే సినిమాలో చూపించాలనే ప్రయత్నం ఆపలేదు. దాదాపు రెండు నెలలు సుదీర్ఘ చర్చల అనంతరం ఈ ప్రాజక్ట్ కొలిక్కి వచ్చింది. ఈ సినిమాని దర్శకత్వం వహించడానికి త్రివిక్రమ్ ఒకే చెప్పారు. ఆయన డైరక్షన్ లో నటించడానికి మెగా బ్రదర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సంగతిని సుబ్బిరామిరెడ్డి అందరితో పంచుకున్నారు.

” మెగా బ్రదర్స్ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది అని చెప్పడానికి చాల ఆనందంగా ఉంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. చిరంజీవి, పవన్ కళ్యాణ్ వారి ప్రాజక్ట్స్ లో బిజీగా ఉన్నారు. వాటి నుంచి బయటికి రాగానే ఈ సినిమాలో పాలుపంచుకుంటారు” అని వెల్లడించారు. ప్రస్తుతం చిరు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి, పవన్ కళ్యాణ్ 25 వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాల తర్వాత మెగా మల్టీ స్టారర్ మూవీ ప్రకటన వెలువడనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus