నవాబ్ లో ఆ డైలాగులు తొలగించకపోతే బాంబు వేస్తామన్నారట!

  • October 4, 2018 / 04:44 AM IST

దర్శక దిగ్గజం మణిరత్నంకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆయన ఆఫీస్ ను బాంబ్ పెట్టి పేల్చేస్తామంటూ కొందరు ఆగంతకులు ఫోన్ చేసి బెదిరించారు. తాజాగా మణిరత్నం తమిళ్ లో “చెక్క చివంత వానం” అనే మూవీని నిర్మించారు. ఈ చిత్రం తెలుగులో ‘నవాబ్’ పేరుతో డబ్ చేశారు. అయితే ఈ సినిమాలోని అభ్యంతరకర డైలాగు తొలగించాలని చెన్నై అభిరామపురంలోని ఉన్న ఆఫీస్ కి ఫోన్ చేసి ఓ ఆగంతకుడు బెదిరించాడు. అయితే ఆ డైలాగ్ ఏమిటనేది ఆగంతకుడు క్లారిటీ ఇవ్వలేదని ఆఫీస్ సిబ్బంది చెబుతున్నారు.

బెదిరింపు కాల్ సంబంధించి మణిరత్నం సిబ్బంది పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆఫీసులో బాంబు స్కాడ్ తో తనిఖీలు నిర్వహించారు. అక్కడ బాంబు దొరకకపోవడంతో అది ఫేక్ కాల్ అని గుర్తించారు. ఈ చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఒక్క తమిళనాడులో దాదాపు 30 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus