మ‌ల్టీస్టార‌ర్ కోసం డైరెక్టర్ తేజ కసరత్తులు..!

  • July 6, 2019 / 07:51 PM IST

ముక్కుసూటితనం వలన చాలా ప్రాజెక్టులను తెరకెక్కించే అవకాశం కోల్పోతూ వచ్చాడు తేజ. ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం తర్వాత తేజ… ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్లోనే వెంకటేష్ తో ఓ చిత్రం చేయాల్సి ఉంది. దీనికి ‘ఆటా నాదే.. వేటా నాదే’ అనే టైటిల్ ను కూడా అనుకున్నారు. కానీ ఎందుకో ఆ సినిమా ఆగిపోయింది. ఇక బాలకృష్ణతో ‘ఎన్టీఆర్ బయోపిక్’ ను కూడా రూపొందించాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ నుండీ తప్పుకున్నాడు. చివరికి బెల్లంబాబు, కాజల్ తో ‘సీత’ అనే చిత్రం చేసాడు. ఇది కాస్తా డిజాస్టర్ అయ్యింది. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ ఎక్జిక్యూషన్ బాలేదని ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తిప్పి కొట్టారు.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తేజ తన త‌దుప‌రి సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడట. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం… ఇదొక మ‌ల్టీస్టార‌ర్ అని తెలుస్తుంది. ఇది పక్కా ఎంట‌ర్‌టైన్‌మెంట్ మూవీ అట. “నేను ఇప్పుడే స్క్రిప్ట్ రాయ‌డం స్టార్ట్ చేశాను. ఇందులో హై ఎమోష‌న్స్‌, కామెడీ అంశాలు ప్ర‌ధానంగా ఉంటాయి. వెంట వెంట‌నే సినిమాలు చేసేయ్యాల‌ని తొంద‌ర‌ప‌డ‌టం లేదు. మంచి స్క్రిప్ట్ కోసం కావాల్సినంత స‌మ‌యం కావాలి” అని తేజ ఓ ఆంగ్ల ప‌త్రిక‌కు తెలియ‌జేశాడు. మరి ఆ స్క్రిప్ట్ ఎప్పుడు పూర్తవుతుందో.. ఎప్పుడు సెట్స్ పైకి వెళ్ళబోతుందో తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus