మరోసారి తన ట్యాలెంట్ చూపించిన శేష్..!

  • August 16, 2019 / 04:31 PM IST

అడివి శేష్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘ఎవరు’. వెంకట్ రాంజీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘పీవీపీ సినిమాస్’ బ్యానర్ పై ప్రసాద్ వి పొట్లూరి నిర్మించాడు. ఆగష్టు 15 న(నిన్న) విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. గతేడాది ఆగష్టుకి ‘గూఢచారి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న అడివి శేష్.. ఈసారి ‘ఎవరు’ చిత్రంతో కూడా తన ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. టీజర్, ట్రైలర్లు చూసినప్పుడే ఈ చిత్రం హిట్టని ఫిక్సయిపోయారు ప్రేక్షకులు. రెజీనా, నవీన్ చంద్ర కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

ఇక ఈ చిత్రం తొలి రోజు మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక ‘ఎవరు’ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 0.64 కోట్లు
వైజాగ్ – 0.21 కోట్లు
ఈస్ట్ – 0.21 కోట్లు


వెస్ట్ – 0.10 కోట్లు
కృష్ణా – 0.15 కోట్లు
గుంటూరు – 0.13 కోట్లు


నెల్లూరు – 0.30 కోట్లు
సీడెడ్ – 0.05 కోట్లు
————————————————–
ఏపీ + తెలంగాణ – 1.65 కోట్లు(షేర్)
—————————————————-


‘ఎవరు’ చిత్రానికి 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం మొదటిరోజు తెలుగు రాష్ట్రాల నుండీ 1.65 కోట్ల షేర్ ను రాబట్టింది. వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే టోటల్ గా 10 కోట్ల పైనే షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆగష్టు 15 న హాలిడే… రావడంతో ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది. రెండో రోజు నుండీ ఈ చిత్రానికి బుకింగ్స్ మరింత పెరిగాయని ట్రేడ్ పండితుల సమాచారం. ఇక మొదటి వారమే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించినా ఆశ్చర్యపడనవసరం లేదని వారు చెబుతున్నారు. వారి నమ్మకం ఎంత బలమైనదో చూడాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus