బ్రేక్ ఈవెన్ కు ఇంచ్ దూరంలో శేష్ ‘ఎవరు’ ..!

  • August 26, 2019 / 06:09 PM IST

అడివి శేష్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘ఎవరు’. వెంకట్ రాంజీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘పీవీపీ సినిమాస్’ బ్యానర్ పై ప్రసాద్ వి పొట్లూరి నిర్మించాడు. ఆగష్టు 15న విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. గతేడాది ఆగష్టుకి ‘గూఢచారి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన శేష్.. ఈసారి ‘ఎవరు’ చిత్రంతో కూడా అలాంటి హిట్ నే అందుకున్నాడని చెప్పాలి. టీజర్, ట్రైలర్లు చూసినప్పుడే ఈ చిత్రం హిట్టని ప్రేక్షకులు ఫిక్సయిపోయారు. ఓ రీమేక్ సినిమాకి ఇంటెలిజెంట్ మార్పులు చేయడంతో ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

ఇక ‘ఎవరు’ 11 డేస్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 3.40 కోట్లు
వైజాగ్ – 1.05 కోట్లు
ఈస్ట్ – 0.52 కోట్లు


వెస్ట్ – 0.33 కోట్లు
కృష్ణా – 0.62 కోట్లు
గుంటూరు – 0.51 కోట్లు


నెల్లూరు – 0.17 కోట్లు
సీడెడ్ – 0.80 కోట్లు
————————————————–
ఏపీ + తెలంగాణ – 7.40 కోట్లు


రెస్ట్ అఫ్ ఇండియా – 0.70 కోట్లు
ఓవర్సీస్ – 1.60 కోట్లు
—————————————————-
వరల్డ్ వైడ్ టోటల్ – 9.70 కోట్లు (షేర్)
—————————————————-

‘ఎవరు’ చిత్రానికి 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం 11 రోజులకి గాను 9.70 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే దాదాపు 90 శాతం రికవరీ అయిపోయినట్టే. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 30 లక్షల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ‘ఎవరు’ చిత్రానికి మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. ఎందుకంటే శుక్రవారం నుండీ ప్రభాస్ ‘సాహో’ ఎంటర్ అవుతుంది. మరి ఈ అవకాశాన్ని ‘ఎవరు’ చిత్రం ఎంతవరకూ ఉపయోగించుకుంటుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus