శేష్ కి ఆగష్టు సెంటిమెంట్ కలిసొస్తుందా?

  • August 14, 2019 / 05:46 PM IST

అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఎవరు’. వెంకట్ రాంజీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘పీవీపీ సినిమా’ బ్యానర్ పై ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్నాడు. ఆగష్టు 15 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. గతేడాది ఆగష్టుకి ‘గూఢచారి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న అడివి శేష్ ఈసారి ‘ఎవరు’ చిత్రంతో అంతకు మించిన బ్లాక్ బస్టర్ కొడతాడని ప్రేక్షకులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టెలనే టీజర్, ట్రైలర్లు ఉండటం విశేషం. రెజీనా, నవీన్ చంద్ర కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మంచి బిజినెస్ జరిగింది. ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 2.8 కోట్లు
వైజాగ్ – 0.95 కోట్లు
ఈస్ట్ – 0.60 కోట్లు


వెస్ట్ – 0.50 కోట్లు
కృష్ణా – 0.65 కోట్లు
గుంటూరు – 0.75 కోట్లు


నెల్లూరు – 0.30 కోట్లు
సీడెడ్ – 1.15 కోట్లు
————————————————–
ఏపీ + తెలంగాణ – 7.7 కోట్లు

కర్ణాటక – 0.50 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 0.15 కోట్లు
ఓవర్సీస్ – 1.65 కోట్లు
——————————————————————
వరల్డ్ వైడ్ టోటల్ – 10 కోట్లు
——————————————————————-

‘ఎవరు’ చిత్రానికి 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 10 కోట్ల పైనే షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఎలాగూ ఆగష్టు 15 న హాలిడే… లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతేడాది విడుదలైన ‘గూఢచారి’ చిత్రం కూడా 10 కోట్ల షేర్ ను రాబట్టింది. సో శేష్ టార్గెట్ చాలా ఈజీ అని చెప్పొచ్చు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus