త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించడానికి అంతా సిద్ధం

  • July 1, 2017 / 01:39 PM IST

కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ శ్రీనివాస్ దిట్ట. అందుకే అతని దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ కథను చేయాలనీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనుకున్నారు. వీరి కాంబినేషన్లో సినిమా రావాలని ఫ్యాన్స్ కూడా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. జనతా గ్యారేజ్  తర్వాత త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ మూవీ చేయాల్సింది. త్రివిక్రమ్, పవన్ ప్రాజక్ట్ తో బిజీ కావడంతో పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో జై లవ కుశ  సినిమా చేస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 21న రిలీజ్ కానుంది. దీని తర్వాత త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలిసింది. రీసెంట్ గా ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి కథని కొలిక్కి తెచ్చినట్లు సమాచారం. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారు. ఆ మూవీ పనులు సెప్టెంబర్ తో పూర్తి అవుతాయి. ఆ తర్వాత రెండు నెలలు స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసి సెప్టెంబర్ 30 నుంచి ఎన్టీఆర్ 28 వ మూవీ సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. అంతేకాదు హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించనున్న ఈ  సినిమాను ఏప్రిల్ ల్లో థియేటర్లోకి తీసుకురావాలని చిత్ర బృందం యోచిస్తోంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus