భరత్ అనే నేను సినిమాలో హైలెట్ కానున్న బాలీవుడ్ హీరో పాడిన పాట.!

  • March 31, 2018 / 06:25 AM IST

మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ చిత్రాలు తీసే కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న “భరత్ అనే నేను” సినిమా రోజురోజుకి అంచనాలను పెంచుకుంటూ పోతోంది. మొదటగా ఫస్ట్ ఓత్ పేరుతో ముఖ్యమంత్రిగా మహేష్ ప్రమాణం చేస్తున్న వాయిస్ అందరినీ ఆకర్షించింది. ఈ మూవీ టీజర్ “ది విజన్ ఆఫ్ భరత్’ పేరుతో రిలీజ్ అయి రికార్డు సృష్టించింది. కొన్ని రోజుల క్రితం విడుదలైన టైటిల్ సాంగ్ సినిమాలోని థీమ్ ని వివరిస్తూ ఆకట్టుకుంటోంది. రేపు మరో పాటని రిలీజ్ చేయనున్నారు.

దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందించిన ఈ పాటను ఓ బాలీవుడ్ హీరో ఫర్హాన్‌ అక్తర్‌ పాడడం విశేషం. అతను నటుడిగా, దర్శకుడిగా విజయం సాధించారు. సింగర్ గాను అభిమానులను సంపాదించుకున్నారు. అతని వాయిస్ “ఐ డోంట్ నో” అనే పాటకు సరిగ్గా సూటవుతుందని భావించి దేవీ తీసుకున్నారు. అతను ఎలా పాడారో తెలుసుకోవాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే. ఇక ఈ పాటని ప్రస్తుతం స్పెయిన్ లోని అందమైన ప్రాంతాలలో తెరకెక్కిస్తున్నారు. చిత్ర బృందం స్పెయిన్ నుంచి ఏప్రిల్ 5 న హైదరాబాద్ కి తిరిగిరానుంది. ఏప్రిల్ 7 న ఆడియో వేడుకను నిర్వహించనుంది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 20 న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus