పోటీకి సిద్ధమైన ఐదు సినిమాలు!

ఒకే రోజు రెండు మూడు సినిమాలు రిలీజ్ కావడం తెలుగు రాష్ట్రాల్లో సహజమే. అయితే ఈసారి ఒకే రోజు ఐదు సినిమాలు పోటీపడనున్నాయి. ఎప్పుడంటే నవంబర్ 10. సీజన్ ఏమీ లేకపోయినప్పటికీ వీకెండ్, బాలల దినోత్సవం సెలవు కలిసి వస్తుందనే ఉద్దేశంతో నిర్మాతలు తమ చిత్రాలను రిలీజ్ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. వీటిలో ప్రధానంగా చెప్పుకునేది ఆక్సిజన్ గురించి.  గోపీచంద్, రాశిఖన్నా, అను

ఇమాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా నటించిన “ఆక్సిజన్” పై చిత్ర యూనిట్ ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో హిట్ ట్రాక్ లోకి రావాలని గోపిచంద్, డైరక్టర్ జ్యోతికృష్ణ భావిస్తున్నారు. ఇక సందీప్ కిషన్ ద్విభాషా చిత్రం “కేరాఫ్ సూర్య”, మంచు మనోజ్ “ఒక్కడు మిగిలాడు”, థ్రిల్లర్ మూవీ “దేవి శ్రీ ప్రసాద్”, కలర్స్ స్వాతి నటించిన “లండన్ బాబులు”తో పాటు తమిళ డబ్బింగ్ చిత్రం “బేబి” కూడా నవంబర్ 10 తేదీన రిలీజ్ కానున్నాయి.  మరి వీటిలో ఏ చిత్రాన్నీ ప్రేక్షకులు ఆదరిస్తారో ఇప్పుడే చెప్పలేము.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus