ఆర్.కె బీచ్ లో హల్ చల్ చేయనున్న గోవింద్ అండ్ కో!

  • August 7, 2018 / 09:33 AM IST

“అర్జున్ రెడ్డి” అనంతరం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన సినిమాలు ఓ అయిదారు ఉన్నా.. విడుదలవుతున్న సినిమా మాత్రం “గీత గోవిందం”. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ-రష్మిక మండన్నా జంటగా నటించగా గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ఈ చిత్రం ట్రైలర్ & సాంగ్ ప్రోమోస్ ఇప్పటికే ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోగా.. విడుదలకి ఇంకా వారం రోజులే ఉండడంతో చిత్రబృందం ఇప్పుడు ప్రమోషన్స్ మొదలెట్టింది. అందులో భాగంగా ఈనెల 12న విశాఖపట్నంలో ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆర్.కే బీచ్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

అన్నీ బాగానే ఉన్నాయి కానీ.. “అర్జున్ రెడ్డి” తర్వాత విడుదలవుతున్న “గీత గోవిందం” చిత్రానికి ఆస్థాయిలో బజ్ మాత్రం రావడం లేదు. పాపం విజయ్ ఆడియో ఫంక్షన్ లో తనపై వచ్చిన ట్రోల్స్ ను తానే ప్లే చేయించుకొని మరీ హంగామా చేసినా సినిమా ప్రమోషన్ కి పెద్దగా ఉపయోగపడలేదు. మరి ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో తన మాటలతో, యాటిట్యూడ్ తో మళ్ళీ ఏదైనా సెన్సేషన్ క్రియేట్ చేస్తే తప్ప జనాలు ఈ చిత్రాన్ని పట్టించుకొనే అవకాశాలు కనిపించడం లేదు. చూద్దాం మరి మన విజయ్ దేవరకొండ ఆగస్ట్ 12వ తారీఖున ఏం చేస్తాడో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus