జెమిని గణేశన్ కి ఎంతమంది కుమార్తెలో తెలుసా ?

  • May 19, 2018 / 10:30 AM IST

అభినేత్రి సావిత్రి గురించి తెలియని వారికి పూర్తిగా అర్ధమయ్యేలా చూపించిన చిత్రం మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కలక్షన్స్ కి దాదాపు సమానంగా ఓవర్సీస్ లో రాబడుతోంది. అమెరికాలో రెండు మిలియన్ మార్క్ దాటిన తొలి తెలుగు లేడీ ఓరియెంటెడ్ సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. గత పది రోజులుగా నిత్యం వార్తల్లో నిలిచిన సావిత్రి గురించి మరింత తెలుసుకోవడానికి చాలామంది నెట్ పేజీలను తిరగేశారు. ఆమెతో పాటు ఆమె భర్త జెమినీగణేష్ గురించి కూడా తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించారు. ఈ సందర్భంగా ఓ విషయం అందరికీ తెలిసింది.

జెమినీ గణేషన్ కి నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారని,  ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నట్లు స్పష్టమయింది. మూడవ భార్య అయిన సావిత్రికి ఒక కొడుకు(సతీష్)  కుమార్తె( విజయ చాముండేశ్వరి) ఉన్నారు. రెండవ భార్య పుష్పవల్లికి ఇద్దరు కుమార్తెలు కాగా.. అందులో బాలీవుడ్ నటి రేఖ ఒకరు. మిగతా ఇద్దరు పెళ్ళాలకు  కలిసి నలుగురు అమ్మాయిలని వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఏడుమంది ఒకే తల్లికి పుట్టున వారిలాగా కలిసి ఉండడమే విశేషం. కమలా, రేఖ, రేవతి, నారాయణి, జయ శ్రీధర్, విజయా చాముండేశ్వరి,  రాధా .. అందరూ కలిసి ఉన్న ఫోటో ఇప్పుడు బయటికి వచ్చి వైరల్ అయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus