ఘాజీ ఓవర్ సీస్ హక్కులను సొంతం చేసుకున్న ప్రభాస్!

  • February 3, 2017 / 07:37 AM IST

సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో దగ్గుబాటి రానా హీరోగా నటించిన ‘ఘాజీ’ సినిమా మూడు భాషల్లో రిలీజ్ కి సిద్ధమైంది. 1971 వ సంవత్సరంలో ఇండియా-పాకిస్తాన్ యుద్ధ కథాంశంతో సాగే ఈ సినిమాలో రానా నేవీ ఆఫీసర్  అర్జున్ గా కనిపించనున్నారు. ఫిబ్రవరి 17న విడుదల కానున్న ఈ చిత్రాని(తెలుగు వెర్షన్) కి మెగాస్టార్ చిరంజీవి  వాయిస్ ఓవర్ ఇచ్చారు. పీవీపీ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీలో తాప్సి హీరోయిన్ గా నటించింది. ఎక్కువశాతం సముద్రం అడుగుభాగంలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాను అధిక మొత్తానికి డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేస్తున్నారు.

ఘాజి ఓవర్ సీస్ హక్కులను ప్రభాస్ సొంతం చేసుకున్నారు. తన మిత్రులైన మూవీ క్రియేషన్స్ సంస్థ వారు రెండు కోట్లు చెల్లించి ఓవర్ సీస్ హక్కులను దక్కించుకున్నారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. బాహుబలి తర్వాత రానా కనిపిస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. మన దేశంలోనే కాకుండా ఓవర్ సీస్ లోను మంచి కలక్షన్స్ రాబడుతుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus