గుణశేఖర్ ను ఆ నిర్మాత మోసం చేశాడా..?

  • June 7, 2016 / 01:45 PM IST

వరుస ఫ్లాప్స్ తో నిరాశలో ఉన్న గుణశేఖర్ తన మొత్తం శక్తిని, డబ్బుని పెట్టి ‘రుధ్రమదేవి’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా హిట్ తో కాస్త తేరుకున్నాడు. అయితే ఈ సినిమా ఎండింగ్ టైటిల్స్ లో రుధ్రమదేవికి కొనసాగింపుగా ‘ప్రతాపరుధ్రుడు’ ఉంటుందని అనౌన్స్ చేశాడు.

రుధ్రమదేవి సినిమా హిట్ అయిందనే నేపధ్యంలో నిర్మాత దిల్ రాజు స్టేజీ మీద ‘ప్రతాపరుధ్రుడు’ చిత్రాన్ని మా బ్యానర్ లోనే నిర్మిస్తామని గుణశేఖర్ కు అభయమిచ్చాడు. దిల్ రాజు మాట మీద నమ్మకంతో గుణశేఖర్ ‘ప్రతాపరుధ్రుడు’ కథను సిద్ధం చేయడానికి ఎంతో కష్టపడ్డాడు. ఎంతో మంది హిస్టరీ ఫ్రొఫెసర్ల తోనూ, చరిత్ర పరిశోదకులతోనూ కలిసీ, ఎంతో పరిశోదన చేసి కథను పూర్తి చేశాడు.

తీరా దిల్ రాజు దగ్గరకు కథను తీసుకెళ్తే ఓ స్టార్ హీరోను ఒప్పించి తీసుకువస్తే సినిమా చేస్తానని లిటికేషన్ పెట్టాడట దిల్ రాజు. దీంతో గుణశేఖర్ అయోమయ స్థితిలో పడిపోయాడు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు ప్రయోగాత్మక చిత్రాలలో నటించడానికి సిద్ధంగా లేరు. ప్రస్తుతం అన్నీ పీరియాడిక్ సినిమాలు వస్తుండడంతో దిల్ రాజు కూడా కావాలనే ఈ సినిమా నుండి తప్పుకున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి. మరి గుణశేఖర్ ఏం చేస్తాడో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus