ప్రభాస్, మహేష్, రాజ్ తరుణ్ లతో ఎఫైర్ గురించి చెప్పిన హెబ్బా పటేల్

  • April 15, 2017 / 01:40 PM IST

కుమారి 21 ఎఫ్ లో బోల్డ్ గా నటించిన హెబ్బా పటేల్ యువకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. తాజాగా వరుణ్ తేజ్ మిస్టర్ మూవీలో చక్కని అభినయంతో టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ విజయవంతమైన సందర్భంగా ఆమె ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనేక ఆసక్తికర సంగతులు వెల్లడించింది. రాజ్ తరుణ్ తో తాను డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఎంజాయ్ చేస్తానని చెప్పి ఆశ్చర్యపరిచింది.

తమ పేరెంట్స్ కూడా ఫీలవ్వరని స్పష్టం చేసింది. ఎందుకంటే రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులందరికీ తెలుసని, అతనితో లింక్ పెడితే వాటిని నమ్మరని హెబ్బా తెలిపింది. సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని, డార్లింగ్ సినిమా చూసినప్పటి నుంచి ప్రభాస్ ప్రేమలో పడిపోయానని వెల్లడించింది. ఇప్పటికీ ఆ స్టార్ హీరోలను కలిసే అవకాశం రాలేదని చెప్పింది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus