గొడవ వల్ల ఆగిపోయిన ‘హలో గురు ప్రేమ కోసమే’ షూటింగ్

  • July 7, 2018 / 01:32 PM IST

అ..ఆ , ప్రేమమ్, శతమానం భవతి, ఉన్నదీ ఒక్కటే జిందగీ సినిమాలతో మలయాళ భామ అనుపమా పరమేశ్వరన్ తెలుగు అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా తేజ్ ఐ లవ్ యూ మూవీలోను ఆమె నటనకు ఎక్కువ మార్కులు పడుతున్నాయి. ప్రస్తుతం ఆమె ఎనర్జిటిక్ హీరో రామ్ తో కలిసి “హలో గురు ప్రేమ కోసమే” అనే సినిమా చేస్తోంది. “నేను లోకల్” ఫేమ్ త్రినాధరావు నక్కి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ప్ర‌కాశ్ రాజ్ కీల‌కపాత్ర‌లో కనిపించనున్నారు. అతనికి అనుపమకు మధ్య అనేక ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ఆ సన్నివేశాలను హైదరాబాద్‌లో కొన్నిరోజులుగా చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ మధ్యలో ఆగిపోయిందని తెలిసింది. అందుకు కారణం వారి మధ్య గొడవని ఫిలిం నగర్ వాసులు చెప్పారు.

వారు చెప్పిన వివరాల ప్రకారం… ప్రకాష్ రాజ్, అనుపమ ఇద్దరు తండ్రీకూతురుగా నటిస్తున్నారు. ఓ సన్నివేశంలో ప్రకాష్ రాజ్ డైలాగ్ చెప్పిన తర్వాత అనుపమ డైలాగ్ చెప్పాలట. అయితే… ప్రకాష్ రాజ్ డైలాగ్ చెప్పిన తర్వాత అనుపమ డైలాగ్ చెప్పడం లేట్ చేస్తుండడంతో ఎక్కువ టేక్స్ చేయాల్సి వస్తోంది. దీంతో అనుపమకి డైలాగ్ చెప్పే విషయంలో ప్రకాష్ రాజ్ క్లాస్ తీసుకున్నారు. అందరి ముందు అనుపమని విమర్శించడంతో ఆమెకు ఏడుపు ఆగలేదంట. కోపంతో ప్రకాష్ రాజ్ సెట్ నుంచి వెళ్లిపోయారు. అనుపమ మూడ్ పోవడంతో డైరక్టర్ పేకప్ చెప్పేసారు. మరి వీరిద్దరూ మునుపటిలా కలిసి నటించడానికి చిత్ర బృందం ఏవిధంగా నచ్చ చెబుతారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus