ఆ దర్శకుడికి నో చెప్పిన రామ్..!

  • August 5, 2019 / 06:20 PM IST

‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు రామ్. ప్రస్తుతం ఈ చిత్రం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రామ్.. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ఓ ఏ చిత్రం చేస్తాడనే విషయం పై ఆసక్తి పెరిగింది. అయితే ఈ చిత్రం పూర్తయ్యాక రామ్ ఓ తమిళ రీమేక్ లో నటిస్తాడని వార్తలొచ్చాయి. వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ లో సక్సెస్ సాధించిన ‘తడం’ అనే చిత్రం తెలుగు రైట్స్ ను… రామ్ పెదనాన్న అయిన నిర్మాత స్రవంతి రవికిషోర్ ఇప్పటికే కొనుగోలు చేశారు. ఈ చిత్రాన్ని రామ్ తో ‘నేను శైలజ’ ‘ఉన్నదీ ఒకటే జిందగీ’ వంటి చిత్రాలను తెరకెక్కించిన కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తారని ప్రచారం జరిగింది.

అయితే రామ్ ఈ చిత్రం నుండీ తప్పుకున్నట్టు తాజా సమాచారం. ఫైనల్ డ్రాఫ్ట్ విన్న తరువాత రామ్ ఈ చిత్రం చేయకూడదని డిసైడ్ అయ్యాడట. కథ, కథనాలు బాగానే ఉన్నప్పటికీ రీమేక్ అనేసరికి రామ్ వెనకడుగు వేస్తున్నాడట. తనకు సినిమా నచ్చినా.. రిస్క్ తీసుకోలేకపోతున్నాని.. చెబుతున్నాడట. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. రామ్ కి బదులు వేరే హీరోని తీసుకోవాలా..? లేక కొన్నాళ్లు ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టాలా..? అనే డైలమాలో నిర్మాత స్రవంతి రవికిషోర్ పడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ చాలా కథలు వింటున్నాడట. ఎలాగూ ఈమధ్య గుండు కొట్టించుకున్నాడు కాబట్టి కొన్ని రోజులు గ్యాప్ తీసుకోవాలని రామ్ భావిస్తున్నాడట. రామ్ తరువాతి సినిమా ఏంటనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus