అనుకున్న దానికంటే విషయం మరింత సీరియస్ అయ్యింది : సందీప్ కిషన్

  • July 10, 2019 / 01:58 PM IST

సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. ఈ శుక్రవారం అంటే జూలై 12న ఈ చిత్రం విడుదలకాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్లకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ప్రమోషన్లలో భాగంగా హీరో సందీప్ కిషన్ ఓ విభిన్న పద్ధతి ఫాలో అవ్వడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే… ప్రియదర్శి తో కలిసి…. సినిమాలో హీరో వాడిన బైకును తన బైక్ అంటూ చెప్పుకుని, అది ఎవరో దొంగతనం చేసారని ఓ వీడియోను క్రియేట్ చేసి ప్రియదర్శి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు… ‘ఎప్పుడు… ఎలా’ అంటూ ఎంతో ఆసక్తితో రియాక్ట్ అయ్యారు. నెటిజెన్లతో పాటు పోలీసులు కూడా రియాక్టవ్వడం సంచలనంగా మారింది.

దొంగతనం… జరిగిన లొకేషన్ చెప్పమంటూ… ప్రియదర్శిని పోలీస్ అధికారి ప్రశ్నించాడు. దీంతో ప్రియదర్శి వెంటనే ఆ వీడియోను డిలీట్ చేసేసాడు.వెంటనే సందీప్ కిషన్ స్పందిస్తూ.. ‘అనుకున్నదానికంటే విషయం మరింత సీరియస్ అయ్యింది. ఇది మా సినిమా ప్రమోషన్లలో భాగం మాత్రమే. అది ప్రియదర్శి బైక్, దాన్ని సినిమాలో వాడటం జరిగింది, అందుకే ఈ తరహా ప్రమోషన్స్ చేశాము’ అంటూ ట్వీట్ చేసి సారీ చెప్పాడు. అందుకు పోలీస్ అధికారి సీరియస్ అవ్వగా.. మరోసారి ప్రియదర్శి కూడా సారీ చెప్పాడు. ఈ పోలీస్ అధికారి ఇలా రియాక్ట్ అవ్వడం పై ఓ నెటిజెన్.. ‘సెలబ్రిటీల కు బాగా రియాక్ట్ అవుతారు సర్.. సామాన్యుల గురించి మాత్రం పట్టించుకోరు’ అంటూ ‘షేమ్’ ‘నేస్టి’ అంటూ హ్యాష్ ట్యాగ్ లతో ట్వీట్ చేయడం మరింత సంచలనంగా మారింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus