ఇది సాధ్యమేనా… సునీల్ ?

  • March 14, 2019 / 04:01 PM IST

కమెడియన్ గా ఎన్నో హిట్టు చిత్రాల్లో నటించి.. తన కామెడీ అంటే ఓ బ్రాండ్ అనేంతలా పేరు తెచ్చుకున్నాడు సునీల్. ఒకానొక టైములో టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ అయిన బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ వంటి వారినే డామినెటే చేసేంతలా… పాపులర్ అయ్యాడు. అప్పట్లో స్టార్ హీరో చిత్రమంటే సునీల్ కామెడీ ఉందా..? అని ప్రేక్షకులు అడిగి మరీ థియేటర్లకి వెళ్ళే వారంటే సునీల్… ఏ రేంజ్ కమెడియన్ అనేది.. అర్ధం చేసుకోవచ్చు. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో హీరోగా మారాడు సునీల్. హీరోగా కూడా మూడు, నాలుగు హిట్లు సాధించాడు.

అయితే మొదట హీరోగా చిత్రాలు చేస్తున్నప్పటికీ… కామెడీ ఉండేలా జాగ్రత్త పడేవాడు… కానీ రాను… రానూ కామెడీ చిత్రాలకి ఆదరణ తగ్గడం వలన… సునీల్ హీరోగా నిలదొక్కుకోవడం కష్టమైపోయింది. ఈ నేపథ్యంలో మళ్ళీ కామెడీ అండ్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేయడానికి రెడీ అయ్యాడు. ఇందులో భాగంగా తన స్నేహితుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అరవింద సామేత’ చిత్రంతో మళ్ళీ ఇటు వైపు మళ్ళాడు. తరువాత రవితేజ – శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంలో కూడా నటించాడు.

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. అయితే మునుపటి లాగా ఫామ్లో లేకపోవడం సునీల్ కి కష్టంగా ఉందేమో… ఇప్పుడు డైరెక్టర్ గా కూడా మారాలని ఉందంటున్నాడు. తాజాగా ‘చిత్రలహరి’ టీజర్ వేడుకలో తన మనసులోని మాటని బయటపెట్టాడు సునీల్. ఇక ఈ విషయం పై సునీల్ మాట్లాడుతూ… “డైరెక్టర్ గా మారి సాయి ధరమ్ తేజ్ ని డైరెక్ట్ చేయాలని ఉంది. సాయి అంటే నాకు చాలా ఇష్టం. తనకోసం కచ్చితంగా ఓ కథ రెడీ చేస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు సునీల్. మరి సునీల్ కోరిక ఎప్పటికి నెలవేరుతుందో చూడాలి. ఇక ‘చిత్రలహరి’ చిత్రం ఏప్రిల్ 12 న విడుదల కాబోతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus