వేద, కామ్నాని ఇబ్బంది పెట్టిన మీడియా

  • December 28, 2016 / 11:36 AM IST

అందాల భామలు సహనాన్ని కోల్పోతున్నారు. చిన్న విషయాలను సైతం మీడియా బూతద్దంలో చూస్తుండడంతో ఓపిక నశించి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద సంఘటన ఇందుకు ఉదాహరణ అయింది. శ్రీ రామదాసు మూవీలో సీతగా ఆకట్టుకున్న వేద(అర్చన), రణం మూవీలో హీరోయిన్ గా అలరించిన కామ్నా జఠ్మలానీ స్నేహితురాళ్ళతో కలిసి తిరుమలకు వెళ్లారు. శ్రీ వేంకటేశ్వరుని దర్శనం కోసం వెళ్తుండగా వారిని మీడియా అడ్డుకుంది. “సాంప్రదాయ దుస్తుల్లో కాకుండా మోడ్రన్ డ్రస్సులు ధరించి వచ్చిన మీకు లోపలి ఎలా అనుమతించారంటూ ” వారిని ప్రశ్నించారు.

అందుకు వేద కోపం తెచ్చుకున్నారు. ఎవరు మోడ్రన్ డ్రస్సులు వేసుకున్నారని ఎదురు ప్రశ్నించారు. దాంతో అవాక్కవ్వడం మీడియా ప్రతినిధుల వంతయింది. వెంటనే వారు అనేక ప్రశ్నల వర్షం కురిపించడంతో  “దర్శనానికి వెళ్తున్నాం” అంటూ హీరోయిన్స్ అక్కడ నుంచి గర్భగుడిలోకి వెళ్లిపోయారు. వేద పంజాబీ డ్రస్సులో ఉన్నప్పటికీ, కామ్నా మాత్రం జీన్స్, కుర్తా లో ఉన్నారు. ఇదే వీరి మధ్య గొడవకు దారితీసింది. హీరోయిన్స్, మీడియా మధ్య జరిగిన వాగ్వాదం ప్రస్తుతం యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ అందుకుంటోంది. కామ్నా జీన్స్ లో రావడం తప్పే.. అయితే అందుకోసం వారిని ప్రశ్నలతో వేధించడం సబబు కాదని వీక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఎక్కువమంది నటీమణులవైపే మాట్లాడం మీడియ ప్రతినిధుల వైఖరిని ప్రశ్నిస్తోంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus