భారీ ధరకు అమ్ముడుపోయిన గౌతమి పుత్ర శాతకర్ణి ఆంధ్ర థియేటర్ హక్కులు

  • January 5, 2017 / 11:12 AM IST

నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి రిలీజ్ కి ముందే రికార్డులు సృష్టిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బాలయ్య వందో చిత్రం టీజర్, ట్రైలర్ కి వచ్చిన స్పందన చూసి డిస్ట్రిబ్యూటర్లు సినిమాను కొనేందుకు ఎగబడ్డారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన పంపిణీదారులు ఫ్యాన్సీ ధర ఇచ్చి ఆ ప్రాంత థియేటర్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కలుపుకొని మొత్తం 21 కోట్ల బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటే కథ, సాయి మాధవ్ రాసిన డైలాగులు, బాలకృష్ణ నటన, హేమమాలిని, శ్రీయ ల అభినయం, క్రిష్ పనితనంపై అందరూ నమ్మకం పెట్టుకున్నారు.

అంతేకాకుండా సినిమా మొదలైనప్పటినుంచి మంచి టాక్ రావడంతో ఎవరూ వెనకడుగు వేయడంలేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో హక్కులు కలుపుకుంటే 39 .5 అయింది. 45 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ సాటిలైట్, ఇతరరాష్ట్ర, దేశాల థియేటర్ హక్కులు కలిపి 63 కోట్ల బిజినెస్ చేసింది. దీంతో శాతకర్ణి సంక్రాంతి హీరోగా నిలవనున్నాడని నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు సెన్సార్ పూర్తి చేసుకొని జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ మూవీ ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus