ధనుష్ కు స్ట్రోక్ ఇచ్చిన రాజశేఖర్ ‘కల్కి’..!

  • April 23, 2019 / 05:08 PM IST

‘గరుడ వేగ’ చిత్రంతో చాలా గ్యాప్ తర్వాత ఓ హిట్టందుకున్నాడు యాంగ్రీ స్టార్ రాజశేఖర్. ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా నటిస్తున్నచిత్రం ‘కల్కి’. ‘అ!’ వంటి వైవిధ్యమైన చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఈ చిత్రం రూపొందుతుంది. ‘హార్ట్ అటాక్’ ఫేమ్ ఆదా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటివరకూ పెద్దగా ఈ చిత్రం గురించి ఎవరూ మాట్లాడుకోలేదు. కానీ టీజర్ తో ఈ చిత్రం పై మంచి ఏర్పడింది. కంటెంట్ చాలా వైవిధ్యభరితమైనదనే విషయాన్ని ఆ టీజర్ చూస్తే అర్ధమవుతుంది.

కేవలం ఈ ఒక్క టీజర్ తో ప్రపంచవ్యాప్త థియేటర్ రైట్స్ విషయంలో పోటీ ఏర్పడిందట. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ ను నిర్మాత రాధామోహన్ 12 కోట్లకు సొంతం చేసుకున్నాడట. దీంతో.. తెలుగులో తన సంస్థ ‘వండర్ బార్’ కార్యకలాపాలను వేగవంతం చేయాలని హీరో ధనుశ్ భావించాడట. ఈ చిత్రం వరల్డ్ వైడ్ థియేటర్ రైట్స్ కి గానూ.. ధనుష్ భారీ రేటుని ఆఫర్ చేశాడని సమాచారం. అయితే అప్పటికే రాధా మోహన్ తో అగ్రిమెంట్ అయిపోయిందని తెలుస్తుంది. ఇక త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus