నాని హీరోయిన్ ఇలాంటి కామెంట్లు చేస్తుందేంటి..!

  • September 5, 2019 / 06:39 PM IST

నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది శ్రద్ధా శ్రీనాథ్. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ చిత్రంలో తన గ్లామర్ పాత్రతో పాటు.. ఓ పిల్లాడికి తల్లిగా కూడా నటించింది. ఓ మధ్య తరగతి కుటుంబంలో బాధ్యతలేని భర్తను భరించే ఇల్లాలి పాత్రలో శ్రద్దా మంచి మార్కులే కొట్టేసింది. ఆమె హీరో ఆదితో నటించిన ‘జోడి’ చిత్రం సెప్టెంబర్ 6 న విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.

శ్రద్దా శ్రీనాథ్ మాట్లాడుతూ.. “నిజ జీవితంలో నాకు పిల్లల్ని కనే ఆలోచన లేదు. మా తాతయ్య..బామ్మలు 15 మంది పిల్లల్ని కన్నారు. నా తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లలు. కానీ నేను మాత్రం పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయంతో నేనెలాంటిదాన్నో డిసైడ్ చేయొద్దు..! నా చదువు, తెలివితేటలను బట్టే తీర్మానించండి… అంటూ చెప్పుకొచ్చింది శ్రద్దా. ప్రస్తుతం తమిళ, కన్నడ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది శ్రద్దా శ్రీనాథ్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus