రంగస్థలం నిర్మాతల ఇళ్లపై ఆదాయపు పన్ను అధికారుల సోదాలు.!

  • March 27, 2018 / 09:30 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో మైత్రి మూవీ బ్యానర్ కి మంచి పేరు ఉంది. ఎందుకంటే ఆ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలే కారణం. నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు  స్థాపించిన ఈ బ్యానర్లో వచ్చిన తొలి మూవీ శ్రీమంతుడు. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ తర్వాత జనతా గ్యారేజ్ వచ్చింది. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ కూడా కలక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు రామ్ చరణ్ తో రంగస్థలం నిర్మించింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 30 న రిలీజ్ కానుంది.

సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ మూవీ భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు టాక్. దీని వల్ల ఐటీ అధికారుల కన్ను ఈ నిర్మాతలపై పడింది. నిన్న నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ ల ఇళ్లపై ఐటీ దాడులు జరిగినట్లు ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. గత సినిమా లాభాలతో పాటు.. రంగస్థలం, సవ్యసాచి లెక్కలు అడిగినట్లు సమాచారం. తమ సినిమా వ్యాపారాలకు సంబంధించిన లెక్కల పత్రాలను అధికారులకు అందించినట్లు తెలిసింది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు. ఈ వార్తలపై నిర్మాతలు ఇంతవరకు స్పందించలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus