ఆది, సింహాద్రికి మించి జనతా గ్యారేజ్ ఇంట్రవెల్ ఫైట్

  • June 22, 2016 / 02:01 PM IST

నూనూగు మీసాల వయసులోనే తొడకొట్టి రికార్డులను క్రియేట్ చేసిన నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆది సినిమాలో ఎన్టీఆర్ చేసిన ఫైట్లను చూసి నందమూరి అభిమానులు తాతకు తగ్గ మనవడు వచ్చాడని సంబర పడ్డారు. ఇక్కడ నుంచే మాస్ లో ఫాలోయింగ్ పెరిగింది. అభిమానుల కోసం ప్రతి సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఉండేలా ఎన్టీఆర్ ప్లాన్ చేశారు.

కొరటాల శివతో చేస్తున్న తాజా చిత్రం జనతా గ్యారేజ్ లోనూ భారీ యాక్షన్ సీన్లు ఉన్నట్లు తెలిసింది. సింహాద్రిలో ఇంటర్వెల్ కి ముందు పెద్ద ఆయుధం తీసుకుని రౌడీలను తరిమినట్లు జనతా గ్యారేజ్ లోనూ విశ్రాంతికి ముందు పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని, కొరటాల శివ టేకింగ్ లో యంగ్ టైగర్ రెచ్చిపోయి ఫైట్ చేసినట్లు సమాచారం.

ఈ ఫైట్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ధీమాగా ఉంది. త్వరలో బ్యాంకాక్ కు చిత్ర యూనిట్ వెళ్లి అక్కడ కొన్ని యాక్షన్ సీన్లు చిత్రీకరించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus