కైరా మనసుదోచుకున్న హీరో ఎవరంటే ?

  • August 1, 2018 / 12:36 PM IST

బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు వారికి బాగా దగ్గరైంది. ఇందులో మహేష్ బాబుని తన ప్రేమలో పడేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన నటిస్తోంది. బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే సంక్రాంతికి థియేటర్లోకి రానుంది. ఈ రెండు సినిమాల మధ్య కైరా ఓ వెబ్ సిరీస్ లో నటించింది. కరణ్‌ జోహార్‌, అనురాగ్‌ కశ్యప్, దివాకర్‌ బెనర్జీ, జోయా అక్తర్‌ కలిసి డైరక్ట్ చేసిన ఈ సిరీస్ పేరు “లస్ట్‌ స్టోరీస్‌”. ఇందులోను మంచి నటన ప్రదర్శించింది. సినిమాలు, వెబ్ సిరీస్ అంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ రీసెంట్ గా పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె గురించి ఆసక్తికర సంగతి తెలిసింది. అదే ఆమె ప్రేమలో ఉన్న సంగతి. బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాని కైరా తన బర్త్ డే వేడుకకి ఆహ్వానించింది.

ఆహ్వానితులందరూ ఉన్నప్పటికీ ఇద్దరూ ఎంతో చనువుగా ఉన్నారు. వారిద్దరి తీరు చూసి ప్రేమలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. కెరీర్ జోరుగా సాగుతున్న సమయంలో ప్రేమ జోలికి పోతే తన కెరీర్ ఏమవుతుందోనని కైరా కొంత ఆందోళన పడుతోంది. అందుకే ప్రేమ విషయాన్ని అధికారికంగా చెప్పడానికి భయపడుతోంది. ఆ వేడుక తర్వాత ఈ విషయాన్ని విలేఖరులు అడిగితే “నో కామెంట్” అంటూ తప్పించుకుంది. మరి ఎప్పుడు ప్రేమ విషయాన్ని స్వయంగా బయటపెడుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus