జై లవ కుశ టీమ్ చలో గుజరాత్

  • April 29, 2017 / 01:12 PM IST

సినిమా ప్రారంభం మొదలు కావడం కాస్త ఆలస్యం అయింది కానీ.. షూటింగ్ లో లేట్ ఉండకూడదని యంగ్ టైగర్ ఎన్టీఆర్ భావిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న జై లవ కుశ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ కి బాహుబలి సెలవులు ఇచ్చారు. అంటే యూనిట్ మొత్తం రాజమౌళి మలిచిన కళాఖండాన్ని చూసేలా వారం రోజులు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. వచ్చేనెల 6వ తేదీ నుంచి తదుపరి షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు. ఈ షెడ్యూల్ గుజరాత్ లో జరగనుంది. అక్కడ కొన్ని కీలకసీన్లు షూట్ చేయనున్నారు.

ఈ చిత్రీకరణలో ఎన్టీఆర్ తో పాటు, హీరోయిన్లు  రాశిఖన్నా, నివేదా థామస్‌, నందిత రాజ్ , తదితరులు కూడా పాల్గొననున్నారు. ఎండలు అదిరిపోతున్నప్పటికీ లెక్క చేయకుండా బాబీ గుజరాత్ వెళ్ళడానికి సిద్ధమవుతోంది. ఎలాగైనా సెప్టెంబర్ 1 చిత్రాన్ని రిలీజ్ చేయాలనీ అందరూ గట్టి సంకల్పంతో ఉన్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో 55 కోట్ల బడ్జెట్ తో కల్యాణ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus